World Bicycle Day: జూన్ 3న సైకిల్ ర్యాలీ
కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ బాధ్యులు
ముకరంపుర, జూన్ 1(విజయక్రాంతి): ప్రపంచ సైక్లింగ్ దినోత్సవం జూన్ 3 సందర్భంగా కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్, ఏ. జె. పెడల్స్ సంయుక్త నిర్వహణలో తలపెట్టిన సైక్లింగ్ ర్యాలీలో ఔత్సాహిక సైక్లిస్టులు, సైక్లింగ్ క్రీడాకారులు పాల్గొనాలని జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్ వి. నరేందర్ రెడ్డి, అధ్యక్షులు కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డిలు విజ్ఞప్తిచేశారు.
సోమవారం నగరంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీ పోస్టర్ను విడుదల చేసి మాట్లాడుతూ 03 జూన్ ఉదయం 5:30 గంటలకు తెలంగాణ చౌక్ నుంచి ఎలగందల వరకు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఈ ర్యాలీలో పాల్గొని పూర్తి చేసిన సైక్లిస్టులకు ప్రశంసాపత్రాలు అందజేస్తామని తెలిపారు. ఆసక్తి కలిగిన అన్ని వయస్సుల వారు ఈ ర్యాలీలో తమ సైకిల్లతో పాల్గొన వచ్చని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు బుధవారం రోజు ఉదయం 5:30 గంటలకు తెలంగాణ చౌరస్తా వద్ద రిపోర్టు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సురభి వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.






