వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి – కనగర్తి గ్రామంలో విషాదం
26-03-2026 04:51 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పులి రవి (38) గురువారం ఉపాధి హామీ పనులకు వెళ్లి పని చేస్తున్న సమయంలో తీవ్ర వడదెబ్బకు గురయ్యాడు.సహచర కార్మికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ, మార్గమధ్యలోనే ఆయన మృతి చెందాడు. మృతుడు రవికి భార్య నిర్మల, ఒక చిన్న పాప ఉన్నారు. కాగా, ఆరు నెలల క్రితం వారి కూతురు మృతి చెందడంతో కుటుంబం ఇప్పటికే విషాదంలో ఉండగా, ఇప్పుడు రవి మరణంతో ఆ కుటుంబం మరింత దుఃఖంలో మునిగిపోయింది.ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు ప్రభుత్వాన్ని బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.




