17-05-2025 12:00:00 AM
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): అధికరక్తపోటుతో అవయవాలకు చేటు అని, ముందుగా గుర్తింపు, చికిత్సతో ప్రమాదాన్ని నివారించవచ్చని మలక్పేట్లోని కేర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ మురళి క్రిష్ణ చెప్పారు. శనివారం ప్రపంచ హైపర్టెన్షన్ డే సందర్భంగా ఆయ న మాట్లాడారు. ‘మీ రక్తపోటు తెలుసుకోండి ఉంచండి’ అంటూ కేర్ హాస్పి టల్స్ ఆధ్వర్యంలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.
ప్రపంచ అధిక రక్తపోటు దినోత్సవం సందర్భంగా 30 ఏళ్లకు పైబడి ప్రతి ఒక్కరూ తమ బీపీని పరీక్షించించుకోవాలని కేర్ హాస్పిటల్స్ తరఫున కోరారు. ముందస్తు గుర్తిస్తే ప్రాణాలను రక్షించుకోవచ్చన్నారు. మన దేశంలోనే దాదాపు 22 కోట్ల మందికి పైగా అధికరక్తపోటుతో బాధపడుతున్నారని చెప్పారు. సరైన అవగాహన తో మరియు సమయానికి తగిన వైద్యం తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు అని తెలిపారు.
ముషీరాబాద్లోని కేర్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎస్కె త్రిపాఠీ మాట్లాడుతూ.. ఔషధాలతో పాటు గుండెకు మేలైన జీవనశైలిని అనుసరించ టం కూడా ఎంతో అవసరమన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, నిత్యం 30 నిమిషాలు వ్యాయామం, ఒత్తిడిని తగ్గించే ధ్యానం లేదా యోగా వంటివి రక్తపోటును నియంత్రించడంలో కీలకపాత్ర వహిస్తాయని చెప్పారు.