25-06-2025 11:05:48 PM
తహసిల్దార్ నరేష్...
మునుగోడు (విజయక్రాంతి): ప్లాస్టిక్ పర్యావరణ, ప్రపంచానికి పెను ప్రమాదం మానవాళి తప్పిదలే పర్యావరణానికి హానికరం ఉందని మునుగోడు తహసిల్దార్ నేలపట్ల నరేష్(Tahsildar Nelapatla Naresh) అన్నారు. మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇండియన్ ఎన్విరాన్ మెంట్ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ... ప్లాస్టిక్ అరికట్టనిదే పర్యావరణాన్ని కాపాడలేమని ప్రతి ఒక్కరు గుర్తించి ప్లాస్టిక్ ను అరికట్టాలని ఆయన విద్యార్థులకు సూచన చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఎన్విరాన్ మెంట్ సోషల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు జీడిమెట్ల రవీందర్ మాట్లాడుతూ... ప్రపంచ పర్యావరణాన్నికాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు విద్యార్థులు యువకులు ప్రజలు పర్యావరణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సకల చరాచరా జీవులకు జీవం పోసిన పర్యావరణం మానవ తప్పిదలు స్వార్థ ప్రయోజనాల కోసం వాడకుండా ప్రజల జీవరాశుల మొనగాడు కోసం ప్రకృతిని కాపాడాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజయ్య, కుడుతాల రత్నయ్య, సుధాకర్ ఉన్నారు.