16 April, 2026 | 9:07 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఘనంగా దత్తాత్రేయ జయంతి

04-12-2025 02:54 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): శ్రీ దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి బాబా ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకుడు ఇందారపు మధుకర్ శర్మ,అర్చకుడు ప్రశాంత్ శర్మ ఆధ్వర్యంలో సాయి బాబా,దత్తాత్రేయ,గణపతి విగ్రహాలకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు అనంతరం గీతా పారాయణం,సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేపట్టారు.సాయిబాబా పల్లకి సేవ నిర్వహించి బాబాకు ప్రత్యేక హారతులు ఇచ్చారు.ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.మండలంలోని నలుమూల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు చెల్లించారు.