అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం
20-06-2026 02:43 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ ఆంగ్ల విభాగ ఆధ్వర్యంలో ఐదు రోజుల ఉపాధ్యాయ శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈశిక్షణా తరగతులకు తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కేవీ రఘుపతి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ ఇంగ్లీష్ క్లాస్ రూమ్ రీసెర్చ్ విభాగాల్లో తీసిస్ రైటింగ్ పై ఉపయుక్తమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంగ్ల వివాహాధిపతి డాక్టర్ జివిఎస్ అనంతలక్ష్మి, డైరెక్టర్ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ అనురాగ్ యూనివర్సిటీ డాక్టర్ మహిపతి శ్రీనివాసరావు యూనివర్సిటీ అధ్యాపక బృందం, ఇతర యూనివర్సిటీ అధ్యాపక బృందం, రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొన్నారు.






