జ్యోతినగర్లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి
20-06-2026 01:54 PM
ముకరంపుర, జూన్ 20(విజయ క్రాంతి) కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 50వ డివిజన్ జ్యోతినగర్ లో నగరపాలక సంస్థ చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. మున్సిపల్ సాధారణ నిధులు రూ. 67.20 లక్షలతో నిర్మించిన డ్రైనేజీ పైప్ లైన్, సిసి రోడ్డును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ శనివారం ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు , 50వ డివిజన్ కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్, ఇతర స్థానిక బీజేపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.






