31 March, 2026 | 5:51 PM

Breaking News

దొంగతనాన్ని అడ్డుకున్న మహిళా కార్మికురాలు   •   మహాలక్ష్మి ద్వారా మహిళలకు రూ.10వేల కోట్లు ఆదా   •   పెన్షనర్ల రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి   •   ఎమ్మెల్సీని సన్మానించిన బిజెపి నాయకుడు లింగాల శంకర్   •   మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్   •   కేవీకేలో పంట మార్పిడి పైన అవగాహన సదస్సు   •   ముత్తారంలో ఉచిత వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకొవాలి   •   బంక్ నిర్వాహకులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి   •   ఎన్నికల వేళ భారీ షాక్... టీవీకే విజయ్‌పై కేసు నమోదు   •   పసుపు రైతులకు మంత్రి తుమ్మల భరోసా.. ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లింపు   •  

దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

31-03-2026 04:10 PM

బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మేడబోయిన యాదగిరి

నాగారం,(విజయక్రాంతి): తుంగతుర్తి నియోజకవర్గ స్థాయిలో ఏప్రిల్ 4, 5వ తారీఖులలో నిర్వహించే దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు మేడబోయిన యాదగిరి పిలుపునిచ్చారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ 2026 కార్యక్రమంలో భాగంగా మంగళవారం లక్ష్మాపురం గ్రామంలో బిజెపి పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మేడబోయిన యాదగిరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఏప్రిల్ 4, 5వ తారీఖులలో తిరుమలగిరి పట్టణ కేంద్రంలో బీజేపీ కార్యకర్తలకు 24 గంటల శిక్షణ శిబిరాల ద్వారా సిద్ధాంతపరమైన అవగాహన, సాంఘిక సవాళ్లను ఎదుర్కోవడం, పార్టీ నిర్మాణంపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ప్రతి బిజెపి పార్టీ కార్యకర్త హాజరుకావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాగారం మండల అధ్యక్షులు కుంభం కరుణాకర్,బిజెపి పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు దేశగాని నర్సయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు శాగంటి సత్తయ్య, జాటోత్ నెహ్రు, బూత్ అధ్యక్షులు శాగంటి వీరభద్రయ్య,బిజెపి పార్టీ నాయకులు జాటోత్ నరేష్, శాగంటి శ్రీను శాగంటి బిక్షం గెండెల ఉప్పలయ్య మేడబోయిన శ్రీకాంత్, భాషబోయిన యాదగిరి,నీలం లింగయ్య తదితరులు పాల్గొన్నారు.