17 April, 2026 | 9:39 PM

Breaking News

రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •  

శాతవాహనలో సజావుగా జరుగుతున్న డిగ్రీ పరీక్షలు

17-05-2025 12:57 PM

కొత్తపల్లి: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులలో రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నందున విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య యు.ఉమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీలో భాగంగా కరీంనగర్ పట్టణంలోని వాణినికేతన్ డిగ్రీ కళాశాలను సందర్శించి పరీక్షలు నడుస్తున్న తీరును పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ... విద్యా సంవత్సరంలో ఎటువంటి మార్పులు లేకుండా తృతీయ సంవత్సర విద్యార్థులకు న్యాయం జరిగేందుకు పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, పరీక్షలు ముగిసిన అనంతరం మూల్యాంకనం కూడా తొందరగా చేపట్టి ఫలితాలను సకాలంలో తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయాలని పరీక్షల నియంత్రణ అధికారి డా.సురేష్ కుమార్ ను ఆదేశించారు.