31-05-2025 08:50:23 PM
పటాన్ చెరు: అమీన్ పూర్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన పలు కట్టడాలను రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేశారు. తహసిల్దార్ వెంకటేష్ రెవెన్యూ అధికారులతో కలిసి నర్రెగూడెంలోని సర్వేనెంబర్ 1112లో, సుల్తాన్ పూర్ పరిధిలోని సర్వేనెంబర్ 457/2లో అక్రమంగా నిర్మించిన పలు కట్టడాలను జేసీబీలతో నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణాలు చేపడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు.