calender_icon.png 20 June, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ కట్టడాలు కూల్చివేత

20-06-2025 12:40:15 AM

  1. శిరుసనగండ్ల ఆలయ భూమిలో నిర్మించిన 34 ఇండ్లు నేలమట్టం

300 మంది పోలీసు పహారాలో -కూల్చివేతలు

చారకొండ, జూన్ 19 : అపర భద్రాదిగా పేరుగాంచిన నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం శిర్సనగండ్ల శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయ భూముల్లో ఆకమ్రణాలను తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఉ త్తర్వుల మేరకు గురువారం భారీ పోలీస్ బందోబస్తు మధ్య నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారు. సర్వేనంబర్ 327లో 9.11, 328లో 7.06 ఎకరాలను భూమిలో 34 మంది ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా 16 పక్కా ఇళ్లు, 11 చిరు వ్యాపార దు కాణాలు, ఏడుగురు స్థలాలను పూర్తిగా నేలమట్టం చేశారు.

అక్రమ నిర్మాణాలను తొల గించాలని ఆలయ కమిటీ చైర్మన్ హైకోర్టు ను ఆశ్రయించగా 2024 జనవరి 23న ఆల య భూముల్లో 34 అక్రమ నిర్మాణాలను గుర్తిస్తూ తొలగించాలని సంబంధిత రెవె న్యూ, దేవాదాయ, పోలీస్ శాఖలకు స్పష్టమై న ఆదేశాలను జారీ చేశారు. ఈ మేరకు గు రువారం తెల్లవారుజామున కల్వకుర్తి ఆర్డీవో సభావత్ శ్రీను, డీఎస్పీ వెంకటేశ్వర్లు, దేవాదాయ శాఖ ఏసీ మదనేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో 300లకు పైగా పోలీస్, దేవాదాయ, ఎక్సైజ్, రెవెన్యూ, అగ్నిమాపక, వైద్య, ఇంటలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ శాఖల సిబ్బందితో పాటు బారీ ప్రొక్లయనర్, ఇతర వాహనాలతో చేరుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వాసితులతో పాటు మాజీ సర్పంచి శారద శ్రీను అధికార పార్టీకి చెందిన ఇళ్లను కాకుండా తమ ఇళ్లనే కక్షపూరితంగా కులుస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఏసీ మదనేశ్వర్రెడ్డి, తహసీల్దార్ సునిత, సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్త్స్ర శంషుద్దీన్లతో వాగ్వాదానికి దిగి ఇళ్లను కూల్చవద్దంటూ అడ్డుతగిలా రు. హైకోర్టు ఆదేశాలతోనే కూల్చివేతలు చే స్తున్నామని అడ్డుకోవద్దని పక్కకు తప్పుకోవాలని సూచించారు.

అయినా బాధితులు అడ్డుకోవడంతో పోలీసులు వారిని బలవంతంగా పక్కకు తప్పించి ఇళ్లను కూల్చివేశారు. పోలీసులే స్వయంగా ఇళ్లల్లోని సామానులు బయటపెట్టారు. కాయా కష్టం చేసి కష్టార్జితం తో కట్టుకన్న ఇళ్లను తమ కళ్ల ముందే ఇంట్లో సామానులు తీసుకోకుండా కూల్చి వేయడంతో నిర్వాసితులు అధికారులు, ఆలయ అర్చకుల తీరుపై దుమ్మిత్తి పోస్తూ శాపనార్టలతో మహిళలు, వృద్ధులు కన్నీరు మున్నీర య్యారు.

కొంత సమయం ఇవ్వమని అడిగి న ఇవ్వకుండా బలవంతంగా ఇళ్లను కూల్చడంపై తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న తమను ఉన్న ఫ ళంగా పోమ్మంటే ఎలాంటూ అగ్రహం వ్య క్తం చేశారు. దీంతో పలువురు పాఠశాల పా త భవనంలో మరికొందరు ఇంటి సామాగ్రిలో కుటుంబ సభ్యులతో కలిసి అదే స్థలం లోనే ఉండి పోయారు.

ఉదయం 6.30 గం టలకు ప్రారంభమైన కూల్చివేతల పర్వం ఉదయం దాదాపు 12 గంటల వరకు బాధితుల నిరసనల మధ్య సాగింది. ఈ కార్యక్ర మంలో సీఐలు నాగర్జున, నాగరాజు, వెంకట్రెడ్డి, దేవాదాయ తహసీల్దార్ గిరిధర్, ఈవోలు వీణాదరీ, తదితరులుఉన్నారు.