calender_icon.png 20 June, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యం పదిలంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం

20-06-2025 12:38:10 AM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ జూన్ 19 (విజయ క్రాంతి) : ప్రతి ఒక్కరి ఆరోగ్యం పదిలంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని మహ బూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువా రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ అర్బన్ మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా పేద ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేశారని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించడం తో పాటు ఐదు లక్షల రూపాయలు ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల అభ్యున్నతికి కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈరోజు 78 మంది లబ్ధిదారులకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారే పల్లి సురేందర్ రెడ్డి, ఓబిసి ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు హన్మంతు, ప్రశాంత్, అంజద్, మోసిన్, రషేద్, నాయకులు లీడర్ రఘు, చర్ల శ్రీనివాసులు, మోయిజ్, అశ్వాక్ తదితరులు పాల్గొన్నారు.