11-10-2025 05:57:59 PM
జిన్నారం: బొల్లారం మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు శనివారం కూల్చివేశారు. మున్సిపల్ కమిషనర్ కిషన్ ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి పోలీసుల సహకారంతో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో కమర్షియల్, ఇతర భవనాలు నిర్మించే వారు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పవని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.