22 April, 2026 | 1:29 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

లక్ష్మీగూడలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

18-12-2024 12:25 PM

అధికారులు బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం 

తమను బతకనివ్వరా అంటూ స్థానికుల ఆగ్రహం 

రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి డివిజన్ లక్ష్మీగూడలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు.  లక్ష్మీగూడ, వాంబే కాలనీకి ఉదయం జేసీబీలు చేరుకున్నాయి. రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్ పైన వెలసిన ఆక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేస్తున్నారు. రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పోలీసు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు, బాధితులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. తమను బతకనివ్వరా అంటూ తీవ్రస్థాయిలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని అధికారులు చెబుతున్నారు.