పొద్దున్నే మద్యం తాగి సభకు వస్తున్నారు: హరీశ్ రావు
18-12-2024 12:36 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కొందరు సభ్యులు పొద్దున్నే మద్యం తాగి సభకు వస్తున్నారన్న హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని హరీష్ కోరారు. సభలో ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. హరీష్ వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.






