14 April, 2026 | 5:14 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

అక్రమ కట్టడం కూల్చివేత

28-01-2026 12:00 AM

కాచివానిసింగారంలో చర్యలు చేపట్టిన హైడ్రా

ఘట్ కేసర్, జనవరి 27(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా ఉప్పల్ జోన్ పరిధి కాచివానిసింగారంలో హైడ్రా మంగళవారం రోడ్డు ఆక్రమణపై చర్యలు చేపట్టింది. మలిపెద్ది హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి 40 ఫీట్ల రహదారిలోకి 13 అడుగుల మేర ఆక్రమించి పక్కనే ఉన్న తన పొలం హద్దులుగా పేర్కొంటూ ఒక కిలోమీటరు మేర ప్రహరీ నిర్మించారు. దివ్యానగర్ సింగరేనియన్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు నారపల్లి, దివ్యనగర్ కాచివాని సిం గారంలను కలుపుతూ సాగే ఈరోడుని ఆక్రమించారంటూ హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

దీంతో హైడ్రా క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో పరిశీలించి 13 అడుగుల మేర కు రోడ్డులోకి జరిగి ప్రహరీ నిర్మించారని తేల్చి కూల్చివేశారు.  హైడ్రా తీసుకుంటున్న చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కాచివానిసింగారంలో ప్రభుత్వ భూమి 6.12 ఎకరాలను ఆక్రమణదారుల నుంచి హైడ్రా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.