07-08-2024 07:53:01 PM
ఆదిలాబాద్: జిల్లాలోని పిప్రి గ్రామంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యాటించారు. పిప్రి గ్రామంలో నిర్వహించిన బహిరంగా సభలో డిప్యూటీ సీఎం భట్టి ప్రసంగించారు. పిపిరి గ్రామస్థులు నిండు మనసుతో ఆశీరదించడంతోనే తన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విజయవంతం కావడంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుతం అధికారంలోకి వచ్చిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అందుచేతనే యాత్రలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటానని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో జిల్లాలోని బజారత్నూర్ మండలం పిప్రి గ్రామం నుండి ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన తరాత గ్రామానికి తానే సయంగా వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తానని ఇచ్చిన హామీ మేరకు బుధవారం పిప్రి గ్రామంలో భట్టి పర్యటించారు. ప్రత్యేక హెలికాప్టర్ లో గ్రామానికి చేరుకున్న డిప్యూటీ సీఎంకు జిల్లా కలెక్టర్ రాజరిషా, ఎస్పీ గౌష్ అలం, స్థానిక ప్రజా ప్రతినిధులు పూల బొకేలు అందించి ఘనంగా సాగతం పలికారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని సీకరించిన భట్టి విక్రమార్క జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ల్యాప్ టాప్ లను అందజేశారు.
అదేవిధంగా మహిళా సంఘాల సభ్యులకు చెక్కులను అందజేశారు. తుమ్మడి హెట్టి పనులు ఆగిపోయాయని, ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందడం లేదన్నారు. మరో నాలుగు ఐదు నెలల్లోనే ఆనాటి సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభించి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టుల కోసం బడ్జెట్లో 400 కోట్లు కేటాయించమని తెలిపారు.
గత పది ఏళ్లలో ఐటీడీఏ లను నిరీర్యం చేశారని, ఐటిడిఏ లను బలోపేతం చేసేందుకు 17 వేల కోట్లు కేటాయించాం అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ను బలోపేతం చేసేందుకు 35 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించామని, పాత పథకాలన్నిటిని పునరుద్ధరిస్తాం అని చెప్పారు. పాదయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాను... బస చేసిన ప్రతి గ్రామాన్ని సందరిస్తానని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాను గుండెల్లో పెట్టుకొని చూసుకునే ప్రభుతం తమదని, ఇందిరమ్మ రాజ్యంలో పోడు భూములకు పట్టాలిస్తాం మన్నారు.
గత ప్రభుతం తీసుకొచ్చిన ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. అసెంబ్లీ లోను చర్చించి, అందరి ఆమోదంతో సమగ్ర భూ చట్టం తెస్తామని తెలిపారు. నాడు రాష్ర్ట ప్రజలకు ఇచ్చిన మాట మేరకు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, పబ్లిక్ సరీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి పేపర్ లీక్ లేకుండా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేస్తన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని, మరో 30 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది తరలో వారికి నియామక పత్రాలు అందజేస్తాం అని తెలిపారు.