11 May, 2026 | 7:00 PM

పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభం

11-05-2026 06:19 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం ఈజీఎస్ నిధులతో రూ.8 లక్షల వ్యయంతో నిర్మించిన టాయిలెట్లను సోమవారం గ్రామ సర్పంచ్ కళా రమేష్ ప్రారంభించారు. దీంతో ఇన్నాళ్లుగా పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు పరిష్కారం లభించిందని గ్రామస్థులు, పాఠశాల సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.నాణ్యత ప్రమాణాలతో టాయిలెట్ల నిర్మాణం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంలో ఇది కీలక అడుగుగా అభివర్ణించారు.