ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.15.82 లక్షల కోట్లు
న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 17 వరకూ నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 16.45 శాతం వృద్ధితో రూ.15.82 లక్షల కోట్లకు చేరినట్లు తాజా ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకూ వసూలైన పన్నుల్లో కార్పొరేట్ పన్నులు రూ.7.42 లక్షల కోట్లుకాగా, నాన్ పన్నుల వసూళ్లు రూ. 7.97 లక్షల కోట్లు. అడ్వాన్సు పన్ను వసూళ్ల జోరుతో ఈ వృద్ధి సాధ్యపడింది. రూ.40,114 కోట్ల సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టీటీ) వసూలయ్యింది. రూ.3.39 లక్షల కోట్ల రిఫండ్స్ జారీ అయ్యాయిరిఫండ్స్ జారీ అయ్యాయి. కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఎస్టీటీల స్థూల వసూళ్లు గత ఏడాది ఇకార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఎస్టీటీల స్థూల వసూళ్లు గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 20.32 శాతం వృద్ధితో రూ. 19.21 లక్షల కోట్లకు పెరిగాయి.




