11 May, 2026 | 1:28 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

విద్యార్థి అదృశ్యం

08-08-2024 03:09 AM

ప్రిన్సిపాల్ ఫిర్యాదుతో కేసు నమోదు

ఘట్‌కేసర్, ఆగస్టు 7: ఓ విద్యార్థి అదృశ్యమైన ఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం..  ఎదులాబాద్‌లోని  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో దామర వినయ్ కుమార్(16) జూన్ 27న ఎంఎల్‌టీ ఫస్ట్ ఇయర్‌లో అడ్మిషన్ పొందాడు. అయితే అతడికి చదువుపై ఆసక్తి లేకపోవటంతో యాజమాన్యానికి చెప్పకుం డా జూలై 19న ఇంటికి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు.. వినయ్ కుమార్‌కు నచ్చజెప్పి తిరిగి ఈనెల 6న కళాశాలలో చేర్పించి వెళ్లారు. అయితే అదేరోజు సాయంత్రం కళాశాలలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లిపోయిన వినయ్ కుమార్ తిరిగి రాలేదు. దీంతో  ప్రిన్సిపాల్ వేణుగోపాల్ బుధవారం ఘట్ కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.