6 July, 2026 | 2:01 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

విద్యార్థి అదృశ్యం

08-08-2024 03:09 AM

ప్రిన్సిపాల్ ఫిర్యాదుతో కేసు నమోదు

ఘట్‌కేసర్, ఆగస్టు 7: ఓ విద్యార్థి అదృశ్యమైన ఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం..  ఎదులాబాద్‌లోని  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో దామర వినయ్ కుమార్(16) జూన్ 27న ఎంఎల్‌టీ ఫస్ట్ ఇయర్‌లో అడ్మిషన్ పొందాడు. అయితే అతడికి చదువుపై ఆసక్తి లేకపోవటంతో యాజమాన్యానికి చెప్పకుం డా జూలై 19న ఇంటికి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు.. వినయ్ కుమార్‌కు నచ్చజెప్పి తిరిగి ఈనెల 6న కళాశాలలో చేర్పించి వెళ్లారు. అయితే అదేరోజు సాయంత్రం కళాశాలలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లిపోయిన వినయ్ కుమార్ తిరిగి రాలేదు. దీంతో  ప్రిన్సిపాల్ వేణుగోపాల్ బుధవారం ఘట్ కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.