17 April, 2026 | 10:58 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

తుఫాన్ సహాయక చర్యలలో ఆపద మిత్రలు కీలకపాత్ర

31-10-2025 01:57 AM

 కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, అక్టోబర్ 30 (విజయ క్రాంతి): మొం థా తుఫాన్ సహాయక చర్యలలో ఆపద మిత్రలు కీలకపా త్ర పోషించారని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. విపత్కర సమయంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ సహా యక చర్యలలో చురుగ్గా పాల్గొనేందుకు ప్రతి మండలానికి కొంత మంది ఆపద మిత్రలను ఎంపిక చేసి వారికి అ వసరమైన శిక్షణ గతంలో అందించామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 300 మంది యువతకు ఆపదమిత్ర లుగా ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చామన్నారు.

ఖమ్మం జిల్లా మున్నేరు పరివాహక ప్రాంతంలో గల లోతట్టు ప్రాంతాలైన సారధి నగర్, బొక్కల గడ్డ, అగ్రహారం కాలనీ, వెంకటేశ్వర నగర్, పద్మావతి కాలనీలలో మొంథా తుఫాన్ సందర్భంగా  శిక్షణ పూర్తి చేసుకున్న ఆపదమిత్రలు బుధ, గురువారాల్లో మున్నేరు లోతట్టు ప్రాంతాల ప్రజలను చైతన్య పరుస్తూ పునరావాస కేంద్రాలకు తరలించుటలో పూర్తిగా సహాయ సహకారాలు అందించారని తెలిపారు.ప్రజలకు తుఫాన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ, జిల్లా అధికారులతో సహాయక చర్యలలో చాలా చురుగ్గా పాల్గొన్నట్లు జిల్లా కలెక్టర్‌అన్నారు