బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
08-12-2024 08:28 PM
కామారెడ్డి (విజయక్రాంతి): పేదలు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో వారి కుటుంబాలకు కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్వో పాల్గొన్నారు.






