03-11-2025 10:07:02 PM
జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): మండలంలోని గుల్లకోట శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈ నెల 4న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ మాట్లాడుతూ... 2025-26 సంవత్సరానికి గాను జిల్లాలో 223.93 లక్షల చేప పిల్లలను పెంచేందుకు ప్రతిపాదన సిద్ధం చేశామని తెలిపారు.
జిల్లాలోని 380 చెరువులు/రిజర్వాయర్లు ఉన్నాయని, వీటిలో 369 సీజనల్ చెరువులలో 115.65 లక్షల 35-40 మిల్లీమీటర్ల చేప పిల్లలు, 5 పేరినియల్, 6 రిజర్వాయర్లలో 108.28 లక్షల 80-100 మిల్లీమీటర్ల చేప పిల్లలను వదలడం జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలో 51.58 లక్షల ఉచిత చేప పిల్లలు పంపిణీ చేయడం జరుగుతుందని, స్థానిక ప్రజా ప్రతినిధులు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.