27 June, 2026 | 7:07 PM

Breaking News

జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •  

ఉండ్రుగొండ సమీపంలో రోడ్డు ప్రమాదం.. కార్పెంటర్ మృతి

03-11-2025 10:09 PM

చివ్వెంల (విజయక్రాంతి): చివ్వెంల మండలంలోని ఉండ్రుగొండ గ్రామానికి చెందిన పర్వతం రామూర్తి(48) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. వివరాల ప్రకారం.. రామూర్తి ప్రతిరోజూ సూర్యాపేటకు వెళ్లి కార్పెంటర్‌గా పనిచేసేవాడు. ఆదివారం సాయంత్రం సుమారు 6.15 గంటల సమయంలో పనులు ముగించుకొని స్వగ్రామానికి తన మోటార్‌సైకిల్‌పై తిరుగు ప్రయాణమవుతుండగా, ఉండ్రుగొండ ఆర్చి సమీపంలో రోడ్డును దాటే ప్రయత్నంలో హైదరాబాదు వైపు నుండి విజయవాడ దిశగా వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. 

దీంతో రామూర్తి మోటార్‌సైకిల్‌తో సహా రోడ్డుపై పడిపోవడంతో తలకు, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలు అయ్యి అక్కడిక్కడే మరణించాడు. ఈ ఘటనపై మృతుడి భార్య శోభ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి. మహేశ్వర్ కేసు నమోదు చేసి, మృతదేహంపై పీఎంఈ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య శోభతో పాటు ముగ్గురు కుమార్తెలు సంతానం ఉన్నారు. ఈ ఘటనతో ఉండ్రుగొండ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.