28 March, 2026 | 12:24 AM

స్వేరోస్ ఆధ్వర్యంలో వృద్ధులకు దోతులు పంపిణీ

27-03-2026 10:44 PM

హనుమకొండ,(విజయక్రాంతి): స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో హనుమకొండ నగరంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు ధోతులు(పంచలు), పండ్లు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ... శ్రీరామనవమి పండగ సందర్భంగా వృద్ధుల ముఖంలో చిరునవ్వు చిగురించేలా, వారికి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని పంచెలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని అన్నారు.వృద్ధులు బయటకు వచ్చి పండుగను సంతోషంగా జరుపుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి వారికి ఒక చిన్న సహాయాన్ని అందించడం జరిగిందన్నారు.