25-11-2025 04:41:32 PM
వెంకటాపూర్(రామప్ప) (విజయక్రాంతి): మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం సెర్ప్ సిసి బానోత్ జ్యోతి ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలకు ఇందిరమ్మ చీరలను అందించారు. ఈ సందర్భంగా సిసి బానోత్ జ్యోతి మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి లబ్దిదారుకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని, స్వయం సహాయక సంఘాల ద్వారా మరింత శక్తివంతంగా నిలవాలనే లక్ష్యంతో ఇలాంటి పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వివో ఓబీ, విఓఏలు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, నాయకులు పాల్గొన్నారు.