03-06-2025 05:02:34 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన విత్తనం-రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి వ్యవసాయ అధికారులు మంగళవారం నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనం - రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించారు. బెల్లంపల్లి మండలంలో వరి KNM 1210 రకం సన్న వడ్ల విత్తన సంచులు 10@ 10 kg 10 బస్తాలు పెసర MGG 347 @3 కేజీ బ్యాగ్ లను ఎంపిక చేసిన రైతులకు పంపిణీ చేశారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఇద్దరు రైతులకు రూ. 50 నామినల్ ఛార్జీలు తీసుకొని విత్తన బస్తాలు పంపిణీ చేశారు.
విత్తనాలు పొందిన రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో విత్తనోత్పత్తి లో మెలుకువలు నేర్చుకునీ వితానోత్ప ప్తి చేపిస్తారు. తద్ద్వారా వచ్చిన విత్తనాలను అదే గ్రామం లోనీ ఇతర రైతులకు విత్తనాలు ఇవ్వాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు.రైతులు పండించిన పంటను ధన్యంగా మనకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మమెన్ చింతంస్వామి, బెల్లంపల్లి ADA రాజానరేందర్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రత్నాకర్, ఏఈఓఎస్ తిరుపతి, AEO ఏ ఈ ఓ శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.