calender_icon.png 5 June, 2025 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి

03-06-2025 05:04:33 PM

ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్..

హుజరాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఏఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు గోపాల్(ASFI Mandal President Gopal) కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల విద్యాధికారికి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు దొమ్మాటి వేణుగోపాల్, కార్యదర్శి రాంపేల్లి రోహిత్ మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభానికి ముందే మరుగుదొడ్లు, వంటగదులు మరమ్మతు చేయాలని, పరిశుభ్రత పాటించాలని, పాత వస్తువులు మార్చాలని కోరారు. ప్రతి గదిలో కరెంట్ కనెక్షన్, మంచినీటి సౌకర్యం కల్పించాలని, ఖాళీ టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు గణేష్, వెంకటేష్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.