28-07-2025 12:23:32 AM
బూర్గంపాడు,జూలై27(విజయక్రాంతి): రోటరీ క్లబ్ అఫ్ ఇన్ భద్ర సారపాక ఆధ్వర్యంలో సారపాక గ్రామ పంచాయతీలోని 120 మంది పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్లు ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రెసిడెంట్ రాంబాబు మా ట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, ప్రతిరోజూ ఎన్నో జీవితాల్లో ఆరోగ్య దీపాలను వెలిగిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ కం ది మహేష్,రోటరీ క్లబ్ సెక్రటరీ చాంద్ బా షా,రోటరీ సభ్యులు చెంగల్ రావు, సాయి రాం, గోవిందా రావు,సౌరవ్ ముఖేర్జీ,యేసో బు,రోటరక్టర్ ప్రెసిడెంట్ విద్యావాణి,సెక్రటరీ మల్లికార్జున్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.