పదో తరగతి పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
కరీంనగర్, మార్చి 23 (విజయ క్రాంతి): కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తిరుమల నగర్ లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తనిఖీ చేశారు. పరీక్షల సరళిని పరిశీలించారు. విధులు నిర్వర్తిస్తున్న అధికారులు సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, ప్రథమ చికిత్స, మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. తరగతి గదిలో తగిన వెంటిలేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా ఎలాంటి చిన్న తప్పిదానికి అవకాశం ఇవ్వకుండా విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.




