26-06-2025 12:00:00 AM
బోథ్, జూన్ 25 (విజయక్రాంతి): బోథ్ పట్టణానికి చెందిన ఎల్కూచి రాజశేఖర్ - దీప దంపతుల కుమార్తె ఎల్కూచి రుతిక లా-సెట్ లో రాష్ట్ర మొదటి ర్యాంక్ సాధించింది. ఇటీవల విడుదలైన తెలంగాణ లాసెట్ 5 ఫలితా ల్లో 5 సంవత్సరాల కోర్సుగాను 85 మార్కులతో స్టేట్ మొదటి ర్యాంకు సాధించింది.
మొదటి ర్యాంకు సాధించిన రుతిక ను తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు అభి నందించారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసి గొప్ప లాయర్గా ఎదిగి పేదలకు సాయం చేస్తానని రుతిక పేర్కొన్నారు.