26-06-2025 12:00:00 AM
ఎస్పీ జానకి షర్మిల
నిర్మల్, జూన్ 2౫ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పోలీస్ శాఖ శాంతి పద్ధతుల పర్యవేక్షణతో పాటు నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. బుధవారం బుధవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి నేరాల నియంత్రణకు తీసుకున్న జాగ్రత్తలపై సూచనలు సలహాలు ఇచ్చారు.
జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణ అసాంఘిక నేరాలు ప్రమాదాల నివా రణ పోలీస్ స్టేషన్లో కేసులతో సత్వర పరిష్కారం తదితర అంశాలపై సమీక్షించిన ఎస్పీ ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రజల పట్ల గౌరవించుతూ వారి సమస్యలను పరిష్కరించా లని సూచించారు.
చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చట్టాలు ఉల్లం ఘిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఏఎస్పీ అవినాష్ కుమార్ రాకేష్ మీనా ఉపేందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.