24-10-2025 05:51:08 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పాత్ర ప్రదర్శన (రోల్ ప్లే) పోటీలు-2025 సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మోడల్ స్కూల్ నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థినులు శ్రావ్య, సహస్ర, కార్తిక, ప్రణతి, హర్షిత పాల్గొని జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచారు. త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి ప్రకటించారు. ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన విద్యార్థినులను, గైడ్ టీచర్లు మురళీధర్, కృష్ణకుమారిలను శుక్రవారం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డా.గోల్డి బల్బీర్ కౌర్ అభినందించారు.