10 April, 2026 | 3:25 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

ఇందిరమ్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

24-10-2025 05:56 PM

మందమర్రి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటి పథకంలో ఎంపికైన లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేసి, పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఎగుడ రాయమల్లు కోరారు. మండలంలోని సారంగపల్లి  గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారులు గోళం సరిత ముత్యాల వెంకట రాజమల్లులకు  ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా శుక్రవారం ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత బిఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల కాలంలో ఒక నిరుపేదకు ఇల్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి పాటు పడుతుందని కొనియాడారు. లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.