10 April, 2026 | 7:27 PM

Breaking News

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం   •   దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •   ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •  

ఐదు ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి

24-10-2025 05:46 PM

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ పోలియో దినోత్సవం

రోటరీఅసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి

కామారెడ్డి,(విజయక్రాంతి): రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ పోలియో దినోత్సవo నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రవితేజ, గెస్ట్ ఆఫ్ హానర్ గా రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి, స్పెషల్ గెస్ట్ గా రోటరీ రీజనల్ ఫెసిలిటేటర్ రంజిత్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి పోలియో టీకాలు వేయించాలని ఈ పోలియో వల్ల చిన్నపిల్లలకి ఎన్నో ప్రమాదాలు వాటిల్లుతాయని పేర్కొన్నారు.

అక్టోబర్ 24 వరల్డ్ పోలియో డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో వీఆర్కె కళాశాల విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు. ఈ పోలియో వ్యాధి నిర్మూలించడంలో రోటరీ పాత్ర ఎంతో ఉందని 2014లో భారతదేశo పోలియో రహిత దేశంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజలంతా ఈ పోలియో గురించి అవగాహన పెంచుకొని చిన్నపిల్లలని సంరక్షించాలని పేర్కొన్నారు. తదనంతరం విద్యార్థినీ విద్యార్థులకు పోలియోపై వ్యాసరచన పోటీ నిర్వహించారు.  దానిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.