14-10-2025 06:56:28 PM
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవిని ప్రముఖ విద్యావేత్త "అల్ఫోర్స్" నరేందర్ రెడ్డికి ఇవ్వాలని ఏఐసిసి పరిశీలకులు, హంగళ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మనెకు జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కిమ్ ఫహద్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎండి అజీమ్, రాచర్ల శ్రీనివాస్, నయీముద్దీన్, ఆసిఫ్, సిద్ధూ, రవి, శ్రీకాంత్, అనిల్, రవితేజ, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.