ఉపాధ్యాయులతో ‘సర్’ విధులు నిర్వహించొద్దు
సీపీఎం రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కిషన్
అబ్దుల్లాపూర్ మెట్, జులై 9: ప్రభుత్వ ఉపాధ్యాయులచే సఆర్ నిర్వహించొద్దని సీఎం పీఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు డి కిషన్ అన్నారు. జీహెచ్ఎంసీ ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని జడ్పీహెచ్ఎస్ ఇంజాపూర్ స్కూల్ ను సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొం టున్న సమస్యలను తెలుసుకునేందుకు విసి ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీ కిషన్ మాట్లాడుతూ.. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు తీవ్రంగా తిష్ట వేషాయని అన్నారు. విద్యార్థుల సంఖ్య కనుగు ణంగా తరగతి గదులు లేక అన్ని సబ్జెక్టులకు సరిపడా ఉపాధ్యాయులు లేక.. అదేవిధంగా ఆటస్థలం, మరుగుదొడ్లు వంటగదులు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు.
ఇటీవల ప్రభుత్వం చెప్పట్టిన స ఆర్ విధులను ప్రభుత్వ ఉపాధ్యాయులచే నిర్వహించడం వల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తీవ్రమైన నష్టం జరుగుతుందన్నా రు. పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు సిలబస్ నష్టపోయి మరింత అన్యాయం కావాలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపే తం చేయడం కోసం స్థానిక సమస్యలను ప రిష్కరించి ప్రైవేట్ కార్పొరేట్ ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా రేపు వామపక్ష విద్యార్థి సంఘా లు తలపెట్టిన విద్యాసంస్థల బందుకు సీ పీఎం పార్టీ సంపూర్ణ మద్దతు పలుకుతుంద ని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు సత్యనారాయణ, పీ శ్రీనివాసు లు, వెంకటకృష్ణ, శ్రీరామ్ మూర్తి, భాస్క ర్, కృష్ణ, శంకరయ్య, మాధవరెడ్డి, సత్యం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.






