వదంతులు నమ్మొద్దు
26-03-2026 12:08 AM
కుషాయిగూడ మార్చి 25 (విజయక్రాంతి) : సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దు ఇంధన కొరత అంటూ వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి వాహన దారులు ఒక్కసారిగా పెట్రో ల్ బంకుల మీదకు వచ్చి బారులు తీరుతూ ఇబ్బందులు ఎదుర్కోవద్దు అని ట్రాఫిక్ సీఐ ఆర్ఎల్ఎన్ రాజు వాహనదారులకు తెలిపారు. సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తే తప్పుడు రాతలు రాస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.




