23 May, 2026 | 6:23 PM

Breaking News

చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •   రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం కావాలి   •   కలుషిత నీరే తాగునీరు.. రోగాల బారిన పడుతున్న ప్రజలు   •  

విత్తనాలు, ఎరువుల సమస్య రావొద్దు

18-06-2024 04:16 AM
  • మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, జూన్ 17: వర్షాకాలంలో వ్యవసాయానికి విద్యుత్ అంతరాయం, విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చూడాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశించారు. సోమవారం హుస్నాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో తాగునీరు, విద్యా, వైద్యం, వ్యవసాయానికి సంబంధించిన సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం, చెరువుల అభివృద్ధి తదితర అంశాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.