23 May, 2026 | 7:05 PM

Breaking News

కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •  

అడ్డూ అదుపు లేకుండా గోవుల రవాణా

18-06-2024 04:12 AM
  • వీహెచ్‌పీ ప్రతినిధులు

మెదక్, జూన్ 17 (విజయక్రాంతి): తెలంగాణలో గోవుల రవాణా అడ్డూ అదుపు లేకుండా సాగుతోందని, ఇందుకు ప్రభుత్వం మద్దతు పూర్తిగా ఉందని.. ఆవు గోస పాపం ఈ ప్రభుత్వానికి తగులుతుందని విశ్వహిందూ పరిషత్ అఖిల భారతీయ మఠ మందిర్ ప్రముఖ్ మూసాపేట రామరాజు, రాష్ట్ర సంపర్క ప్రముఖ్ వెంకటేశ్వర రాజు విమర్శించారు. రెండు రోజుల క్రితం మెదక్‌లో జరిగిన అల్లర్లపై, గోవుల రవాణాపై స్పందిస్తూ సోమవారం మెదక్‌లోని శ్రీమా త బోరంచమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

రాష్ట్రంలో గోవుల రవాణా అరికట్టడా నికి చెక్‌పోస్టులు పెట్టినట్లు ప్రభుత్వం చెబుతున్నా, వేలాది ఆవులు ఎందుకు వస్తున్నా యని ప్రశ్నించారు. మెదక్‌లో జరిగిన అల్లర్ల కు పోలీసుల ఫెయిల్యూరే కారణమని, హిందూ చట్టాన్ని కాపాడమంటున్న వారిని అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమ ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎంఐఎం కనుసన్నల్లో పాలన సాగుతోందని ఆరోపించారు. పోలీసులు పట్టుకున్న గోవులు ఎటు తరలిపోతున్నాయో చెప్పాలన్నారు. మెదక్‌లో జరిగిన అల్లర్లపై స్థానిక ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో సుభాష్ చందర్, పబ్బ సత్యనారా యణ, మల్కాజి సత్యనారాయణ, చెన్న రాంచంద్రం పాల్గొన్నారు.