04-06-2025 06:47:30 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రంలో కన్యకా పరమేశ్వరి దేవాలయం వద్ద, బంధం చెరువు వద్ద రోడ్డు కిరువైపులా గుంచీలు వేసుకుని వివిధ వ్యాపారాలు చేస్తూ జీవనం గడుస్తున్న వారి గుంచీలు తొలగించేందుకు నోటీసులు జారీ చేయడం సరైనది కాదని, గుంచీలు తొలగించి వారి జీవనం వీధిపాలు చేయకూడదని మున్సిపల్ సిపిఐ మాజీ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు.
ఎన్నో ఏళ్లుగా రోడ్ల వెంట వ్యాపారాలు తీసుకొని జీవిస్తున్న వీధి వ్యాపారులకు జీవనోపాధి లేకుండా చేయాలని చూస్తే వారి తరఫున ఉద్యమిస్తామని, వారికి ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తూ రోజువారి వ్యాపారాల ద్వారా వందలాదిమంది జీవనం సాగిస్తుండగా వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా వారిని అక్కడి నుంచి తొలగించాలనే ఆలోచన సరైంది కాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీధి వ్యాపారులు కవిత, భద్రయ్య, పాష, బిచ్చు, గోపాల్, మహేష్, సుమన్, రఫీ, యాదాద్రి, సత్తెమ్మ, కిరణ్, యూసుఫ్, అహ్మద్, వీరన్న, సిపిఐ నాయకులు పెరుగు కుమార్, రేషపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.