04-06-2025 06:45:44 PM
జిల్లా ఎస్పీ జానకి షర్మిల..
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో పోలీసు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది రైతులు ప్రజల పట్ల మర్యాదగా వివరించాలని జిల్లా ఎస్పీ జానకి(District SP Janaki Sharmila) పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఖానాపూర్ మండలంలోని ఎల్లాపూర్ గ్రామంలో గ్రామ రెవెన్యూ సదస్సులో ఓ రైతు పట్ల ఓ పోలీస్ అధికారి వివరించిన తీరుపై సర్వత్ర విమర్శలు రావడంతో పోలీసు అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగిందని ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు సమయంను పాటించాలని సూచించారు.
రైతులు ఏ సమస్య అయినా వివరింది వివరించేందుకు వచ్చినప్పుడు వారి సమస్యలను ఓపికగా విని వారిని సంబంధిత అధికారి దగ్గరకు తీసుకెళ్తే పోలీసుల పట్ల ఆయనకు గౌరవం పెరుగుతుందని ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. ఖానాపూర్ ఘటనపై జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క పోలీస్ అధికారులు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో వెంటనే నివేదిక అందించామని తెలిపారు. రైతు పట్ల దురుసుగా వివరించిన ఏఎస్ఐ రామచంద్రన్ ఉన్నతాధికారులు ఆదేశం మేరకు సస్పెండ్ చేయడం జరిగిందని ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె హెచ్చరించారు. పోలీస్ శాఖ శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం కృషి చేస్తుందని ప్రజలు రైతులు కూడా పోలీసులు చెప్పిన మాటలను వినిపించుకోవాలని శాంతి భద్రతలకు సహకరించాలని అన్నారు.