18-09-2025 12:43:54 AM
వారం రోజుల పాటు జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులను వైద్య అధికారులు తనిఖీ చేయాలి
ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై డిప్యూటీ సీఎం సమీక్ష
ఖమ్మం, సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి): ప్రజారోగ్యం పట్ల ఆసుపత్రులు అంకిత భావంతో పని చేయాలని డిప్యూటీ సిఎం. భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్కమల్లు బుధవారం పోలీస్ కమీషనర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్, వై ద్య అధికారులతో కలిసి వైద్య ఆరోగ్యశాఖపై స మీక్షించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రభుత్వ, 627 ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలకు అంకితభావంతో మంచి సేవలు అందించాలని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు మంచి సేవలు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఎన్ని అ వాంతరాలొచ్చినా ప్రజలకు ఇబ్బంది కావొద్దన్న ఆశయంతో చాలా ఆసుపత్రు లను ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ పరిధిలో చేర్చుకొని జిల్లా స్థాయిలో కో-ఆర్డినేటర్ ల ద్వారా మానిటరింగ్ చేస్తూ కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించిందని అన్నారు.
పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు, ఆసుపత్రులు ఆధునిక సౌకర్యాల తో పాటు క్లినికల్ ఎష్టాబ్లీష్మెంట్ చట్టం ప్రకా రం నియమ నిబంధనలు తప్పక పాటించాలని అన్నారు. ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి పో ల్యూషన్ బోర్డ్ సర్టిఫికెట్, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ లో నాణ్యతలు పాటించాలని, పేషంట్ కు, పేషంట్ తో పాటు వ చ్చేవారికి ఆసుపత్రు లలో కనీస సౌకర్యాలు తప్పక కల్పించాలని, వైద్య సేవలకు, సర్జరీలకు తీసుకునే చార్జెస్ ను రాక్ రేట్స్ చార్ట్ ప్రజలకు కనపడే విధంగా అందుబాటులో ఉంచాలని అన్నారు.
వైద్యశాఖ అధికారులు మరో వారం రోజుల పాటు కనీస అవసరా లు, ట్రీట్మెంట్ ప్రోటోకాల్ పద్ధతి, క్లినికల్ ఎ స్టాబ్లిష్మెంట్ చట్టం నియమ, నిబంధనలు ప్రైవేట్ ఆసుపత్రులు పాటిస్తున్నారా లేదా అని తనిఖీలు చేయాలని, ప్రజలకు సరైన వై ద్యం అందించని, కనీస వసతులు లేని ఆసుపత్రులను, ప్రజల నుండి ఆరోపణలు వచ్చి న ఆసుపత్రులను గుర్తించి రూల్స్ కు విరుద్ధంగా ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని, వైద్య అధికారులు అప్రమత్తంగా వుండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ సమీ క్షా సమావేశంలో అదనపు కలెక్టర్ డా.పి. శ్రీజ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా.బి. కళావతి బాయి, గవర్నమెంట్ హాస్పటల్ మెడికల్ సూపరింటెండెంట్ డా.నరేందర్, డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ. డా.చందు నాయక్, ఆరోగ్యశ్రీ జిల్లా మానేజర్ శ్రీనివాస్ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గోన్నారు.