2 July, 2026 | 2:28 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఎమ్మెల్యే జిఎంఆర్

18-09-2025 12:44 AM

పటాన్చెరు,(విజయక్రాంతి): ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడంలేదని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి  ప్రకటనలో తెలిపారు.  తన పెద్ద కుమారుడు దివంగత గూడెం విష్ణువర్ధన్ రెడ్డి మరణం  అనంతరం పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవద్దని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 19న ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, కార్యకర్తలు నియోజకవర్గం ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. 

ఈ నేపథ్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా ఎటువంటి వేడుకలు నిర్వహించవద్దని.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని కోరారు. కుల మతాలకు అతీతంగా.. నియోజకవర్గ అభివృద్ధి కోసం భగవంతుని ప్రార్థించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన పుట్టినరోజున సన్నిహితులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ ప్రజల అభిమానం, ఆప్యాయత, ఆశీర్వాదాలు ఎల్లప్పుడు తనపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.