12-09-2025 01:19:41 AM
నల్లగొండ టౌన్, సెప్టెంబర్11 (విజయక్రాంతి): ఇటీవల కాలంలో ప్రజలపై వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్న దృష్ట్యా అవగాహనతో పాటు, వ్యాక్సినేషన్, కుక్కల పట్ల ప్రేమ, దయ చూపించే వారికి నల్గొండ జిల్లాలో ఈనెల 13న కుక్కల దత్తత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ తెలిపారు.
గురువారం అయన కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ 13 న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ సమీపంలో ఉన్న రామగిరి మున్సిపల్ పార్కులో కుక్కల దత్తత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని ఆయన వెల్లడించారు.
మిర్యాలగూడలో 50 లక్షల రూపాయలతో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ఇటీవలే మిర్యాలగూడ శాసనసభ్యులు, ఎమ్మెల్సీ శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్ ,మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, తదితరులు ఈ మీడియా ప్రతినిధుల సమావేశానికి హాజరయ్యారు.