calender_icon.png 15 June, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానం ప్రాణదానంతో సమానం

14-06-2025 11:36:31 PM

స్వర్ణ భారతి ట్రస్ట్ అధ్యక్షులు నీలా సత్యనారాయణ..

కోదాడ: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకునేందుకు రక్త దాతలు ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలవాలని స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్(Swarna Bharat Charitable Trust) అధ్యక్షులు నీల సత్యనారాయణ అన్నారు. శనివారం ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా కోదాడ పట్టణంలోని స్థానిక తిరుమల హాస్పిటల్ బ్లడ్ బ్యాంకులో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆరోగ్యంగా ఉన్నవారు రక్తదానం చేయడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడిన వారము అవుతామని యువతీ యువకులు రక్తదానం చేసేందుకు తప్పక ముందుకు రావాలన్నారు. అనంతరం ఆపదలో ఉన్నవారికి అత్యధిక సార్లు రక్తం అందించి ప్రాణదాతలుగా నిలిచిన షేక్ నజీర్, ఓరుగంటి కిట్టులను శాలువా, మెమెంటో, ప్రశంసా పత్రాలతో ఘనంగా సన్మానించారు. పైడిమర్రి వెంకటనారాయణ, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చారు గండ్ల రాజశేఖర్, ఉపాధ్యక్షులు కాటేపల్లి నరసింహారావు, పత్తి నరేందర్, వెంపటి వెంకటరమణ, రామ్మూర్తి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.