calender_icon.png 15 June, 2025 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కని మార్గం

14-06-2025 11:29:28 PM

కోదాడ: దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి మార్గమని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి సురేష్(Senior Civil Judge Suresh) అన్నారు. శనివారం కోదాడ కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లోక్ అదాలత్ తో కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా అవుతాయి అన్నారు. రాజీ మార్గమే రాజ మార్గమని కక్షలు, పట్టింపులకు పోయి కక్షి దారులు నష్ట పోవద్దని సూచించారు. వివిధ రకాల కేసులు మొత్తం 1233 కేసులు ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించినట్లు తెలిపారు.

ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్య, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చిత్తలూరి సత్యనారాయణ  , బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య, బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు కోడూరు వెంకటేశ్వరరావు,యడ్లపల్లి వెంకటేశ్వర్లు, హుస్సేన్, కానుగు మురళి,ఏ పీ పీ సిలివేరు వెంకటేశ్వర్లు, లోక్ అదాలత్ సభ్యులు అర్వపల్లి పవన్ కుమార్, ఆవుల మల్లికార్జున రావు, సామ నవీన్ కుమార్, గంధం కోదండపాణి,  న్యాయవాదులు తమ్మినేని హనుమంత రావు,  గట్ల నరసింహారావు, ఈదుల కృష్ణయ్య,MVS శాస్ట్రీ, దావీదు,బెల్లంకొండ గోవర్ధన్, శ్రీదేవి, SK రహీం, హేమలత,మంద వెంకటేశ్వర్లు, రియాజ్, పాషా, నాగుల్ మీరా పాల్గొన్నారు.