18-10-2025 12:15:38 AM
- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 17 (విజయక్రాంతి): సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన ప్రభుత్వ విప్ వే ములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.బీసీ సం ఘాల పెద్దలు 42 శాతం రిజర్వేషన్ రాజకీయంగా ఇవ్వాలని 18న ఇచ్చిన తెలంగాణ బంధుకు జిల్లా కాంగ్రెస్ పక్షాన మద్దతు ఇ స్తున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాట కోసం బీసీలకు 42 శాతం వి ద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ కోసం కృషి చేసినం అసెంబ్లీలో బిల్లులను పాస్ చే సుకుని కేంద్రానికి పంపడం జరిగింది.
కాంగ్రెస్ కృత నిశ్చయంతో ముందుకు పో తున్న తరుణంలో హై కోర్ట్ స్టే రావడం జరిగింది.ప్రజలను మేల్కొలిపే విధంగా బీసీ సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్ కు కాం గ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు సంఘీభావం తెలిపారు.బంద్ కు అన్ని వర్గాల ప్రజలు స్వ చ్ఛందగా. సహకరించాలి.కోర్టులో న్యాయపరంగా. కొట్లాడుతాం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుతున్నాం మాకు పూర్తి ఆశాభావం ఉంది.బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వం వద్దకు బిల్లులు వెళితే 8 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకు ఒప్పించడం లేదు,బీసీలకు నోటి కాడికి వచ్చిన బుక్కను లాక్కోవద్దని బిజెపి నాయకులను కోరుతున్నారాజ్యాంగంలో 50 శాతం క్యాబ్ ఎక్కడా లేదు.
కోర్టులో సవాలు చేసిన వారు జీఓ 9 జీవోను సవాల్ చేశారు కానీ చట్టాన్ని కాదు.బీసీ రిజర్వేషన్ల కోసం చిత్త శుద్ధి తో మేం ముందుకు పోతున్నాం బిజెపి నాయకులు కూడా ఆలోచన చేయాలి.18న జరిగే బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ సంగీతం శ్రీనివాస్. శివప్రసాద్. బిసి సంఘ రాష్ట్ర అధ్యక్షులు. గోనె ఎల్లప్ప దేవరాజ్.