26 June, 2026 | 6:47 PM

Breaking News

ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •  

రిజర్వేషన్లకు రాజ్యాంగాన్ని సవరించాలి

18-10-2025 12:15 AM

బీసీ ఉద్యోగుల సంఘం 

ముషీరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేపట్టాలని తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం ప్రతినిధులతో కలిసి మాట్లాడుతూ.. రిజర్వేషన్స్ లేక పోవడం వల్ల అన్యాయం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.

బీసీ ఉద్యోగులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ అమలు చేయాలని అన్నారు. శనివారం బీసీ బంద్‌కు సంఘీభావంగా రాష్ట్రంలోని బీసీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతారని పేర్కొన్నారు. సమావేశంలో రమాదేవి, జ్ఞానేశ్వర్, రామరాజు, శ్రీనివాస్, శంకర్, యాదయ్య, సాగర్, జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.