20 March, 2026 | 9:19 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

మా సహనాన్ని పరీక్షించొద్దు

13-09-2024 01:13 AM
  1. కౌశిక్‌రెడ్డి బతుకేందో అందరికీ తెలుసు
  2. పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు
  3. ఎమ్మెల్యేలు దానం, ప్రకాశ్, కాలె, ఎంపీ అనిల్
  4. నార్సింగి పీఎస్‌లో ఎమ్మెల్యే గాంధీకి పరామర్శ

రాజేంద్రనగర్, సెప్టెంబర్12: ‘మా సహనాన్ని పరీక్షించొద్దు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సహనం పాటిస్తున్నాం. అనవసరంగా తమను గెలికితే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్  అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ వ్యవహారంలో పోలీసులు గాంధీని అరెస్టు చేసి నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.

మధ్యాహ్నం నాలుగు గంటలకు పీఎస్‌లో గాంధీని ఎమ్మెల్యేలు, ఎంపీ పరామర్శించారు. అనంతరం పీఎస్ ఎదుట మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పిచ్చికుక్కలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 

అధికారం మాదే.. ఏదైనా చేస్తం..

బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని ఎమ్మెల్యేలు దానం, ప్రకాశ్‌గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ ఆరోపించారు. గత సర్కారు హయాంలో అడ్డగోలుగా వ్యవహరించారని విమర్శించారు. తాము కోర్టు ఇచ్చిన ఆదేశాలను శిరసావహిస్తున్నామని, కౌశిక్‌రెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ తమను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. తాము అధికారంలో ఉన్నామని, తాము అనుకుంటే ఏదైనా చేస్తామన్నారు. ఎమ్మెల్యే గాంధీ టెక్నికల్‌గా ఇంకా బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు గుర్తు చేశారు. కౌశిక్‌రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని సూచించారు. హరీశ్‌రావు సీజనల్ పొలిటీషియన్ అని దానం ఎద్దేవా చేశారు. 

 బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లను దిగ్బంధిస్తం..

 తాము అధికారంలో ఉన్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా దిగ్భందిస్తామని హెచ్చరించారు. కౌశిక్‌రెడ్డి ప్రాంతాల మధ్య విబేధాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కౌశిక్‌రెడ్డి సంగతి అందరికీ తెలుసని అన్నారు. తాము మహిళా కాంగ్రెస్ నేతలను పంపించి కౌశిక్‌కు చీర కట్టించి గాజులు తొడిగిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్ నేతలు తమ తీరు మార్చుకోకపోతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నేతలు పీఎస్‌కు తరలిరావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నార్సింగి, రాజేంద్రనగర్ ఏసీపీలు రమణగౌడ్, శ్రీనివాస్ పరిస్థితిని సమీక్షించారు.